ఎంకి పెళ్ళి...

 ఎంకి పెళ్ళి... 

నిరుపేద దేశం ఆరోజుల్లో భారత దేశం. ప్రతి ఊరులోనూ ఉన్నత ప్రమాణాలతో స్కూళ్లు కట్టలేక, తనకున్న స్తోమతకు ఉన్న కొద్ది డబ్బునీ క్రీమ్ డే లా క్రీమ్ (creme de la creme) మీద పెట్టిన కాయ్ రాజా కాయ్, నవోదయ.  మానవ వనరుల శాఖను స్థాపించిన పీ.వీ. అనే బహుభాషజ్ఞుడు బహుముఖ ప్రజ్ఞాశాలి కన్న కల నవోదయ. దేశంలో మారుమూల ఉన్న ప్రతిభకు వేసిన ఒక పందెం.


నవోదయలో ఉన్న ఈ 500 మంది బాధ్యత ఒక్కరి చేతి మీద ఉంటుంది, అది అధిపతి, ప్రిన్సిపాల్ చేతిలో. అధికారమైనా, అభిమానమయినా, అభియోగమయినా.

అందుకే రెండువైపులా పదునున్న కత్తుల్లాంటి నాయకత్వపు లక్షణాలున్న విద్యావేత్తలను అధిపతులుగా, ఉపాధ్యాయులుగా ఎంచి వేసేవారు. లండన్లో తర్ఫీదు పొంది, పాఠ్య పుస్తకాలు రాయడం, పాటలు సాహిత్యం రాయడం వచ్చిన ప్రిన్సిపాల్  సార్ ఒకరోజు అంబేద్కర్ మీద, ఒక పాట రాసారు. అక్కడితో ఆగక ఘటం మీద సంగీతం చేర్చారు, స్వయనా ద్వారం వెంకటస్వామి నాయుడు వారి మనుమడైన, కొత్తగా వచ్చిన మెరుపులాంటి కుర్రాడు మ్యూజిక్ మాస్టర్ గారితో. అద్భుతమైన పాట. 


కన్నీటీ సిరాతో నువు రాసిన కావ్యం ...

బడుగు బతుకుల్లో సిరివెన్నెల చూడమన్నదీ ... 


పాటలో అంబేద్కర్ పుట్టడం, ప్రజలకోసం ఆయన రాజ్యాంగం రాయడం, ఆయన ఆలోచనలతో వలన ఇలా నవోదయ పెట్టడం అలా. 

పాట బాగుంది రోయ్ అనుకున్నాడు కిట్టు. ఒక రెండు వారాలుగా ఎప్పుడూ చూసినా సంగీత లక్ష్మీ, ఇంకా పెద్ద పెద్ద స్కూలు సింగర్లు మ్యూజిక్ సార్ తో కలిసి పాడి పడేస్తున్నారు. 


ఒక రోజు అదే మార్గాన వెళ్తున్నాడు కిట్టు. అబ్బాయిలు అమ్మాయిల డార్మిటరీ వెనుకాల నుండి, ప్రిన్సిపాల్ గృహం ఎదురుగా మగ పిల్లలు వేరేగా వెళ్ళాల్సిన మార్గం అన్నమాట.  

షాడో ప్లే అంటే, వెనుక లైట్ వేసి దుప్పటి మీద నీడలో ఆడే నాటకం. ఆ పాట పాడుతుంది షాడో ప్లే కోసం అన్నమాట. 

అప్పటికి కిట్టూకి ఎదుగుదల ఇంకా లేదు. ఒక 4 అడుగుల 5 అంగుళాల ఉంటాడు, మొత్తం స్కూళ్లో పొట్టివాడు (చక్రి, రవి, కిరణ్ తప్పించి). 


అలా సాయంత్రం సరదాగా చెట్టా పట్టాలు వేసుకు వెళ్తున్న వీరికి ఎదురుగా ప్రిన్సిపాల్. 

ఒకరు కావాలి అని అడిగితే, అప్పుడు తప్పించు కోవడానికి అవకాశం లేకుండా కిట్టు గాడిని ముందుకు తోశారు అతని మిత్రులు. 

క్వార్టర్ వెనకాల సుజాత అక్క, సాయంత్రం చక్కగా తయారు అయి కడిగిన ముత్యం లాగ ఉంది. 

"వీడు సరిపోతాడే?"  అని అడిగారు ప్రిన్సిపాల్. 

అక్క చూసింది, "ఔను సార్ కరెక్ట్"  అంటున్నది. 

అంతా పొట్ట మీద చెయ్యి వేసుకుని పడి పడి నవ్వుతున్నారు. 


"కిట్టు గా వెళ్ళి అక్క వళ్ళో పడుకో !!"  

కిట్టు గాడికి అర్థం అవ్వటం లేదు. అక్క కిట్టూని పసి వాడిలాగా ఒగ్గు పెట్టుకుంది. వళ్ళో, చంటాడిలా కిట్టుని పెట్టుకుంది, పాలు పట్టినట్టు. అక్క ఒళ్ళోంచి వదిలించుకునే అవకాశం లేదు, పసి పిల్లాడి చెయ్యి వెనక్కి వేసినట్టు లాఘవంగా పట్టుకుంది. బిత్తర పోయి చూస్తున్నాడు, వెనుక లైటు ఎదుట పెద్ద తెల్ల గుడ్డ మీద నీడ లో వీడు + అక్క. 



వెనుక హార్మనియం, డప్పులు మొదలయ్యాయి.... 

ఫలానా ఫలానా పసి బిడ్డ ను పెంచింది,

ఫలానా ఫలానా గొప్ప మాత ...... టాన్ టాన్ టాన్

ఇందాకల సాహిత్యం. ఇప్పుడు కఠోరంగా ఉంది. 

కిట్టు చంటి అంబేద్కర్ అన్నమాట.. 

పాలు తాగే పిల్లాడు... 


నీడలో ప్లే. హార్మోనియం మీద సంగీతం ద్వారం మాస్టారు దుల్లగొట్టేస్తున్నారు.

అలా స్కూల్ మొదలయిన మొదటి మాసానికే అడ్డంగా బలైపోయాడు కిట్టు గాడు....

1995

 1995

నవోదయ వైకుంఠపురం, పాత ప్రదేశం నుండి నవోదయ నగర్ కు మారిన మొదటి రోజు. 

మహా మత్స్యావతారం ఎత్తిన విష్ణు మూర్తి, కుండలోనించి కొలనులోకి చేరిన విధంగా ఉంది నవోదయ కొత్త పరిసరాల్లోకి మారడం. ఒకొక్క బ్యాచ్ పాత క్యాంపస్ లో చేరడంతో 7 బాచులతో కిక్కిరిసి పోయింది పాత స్కూల్.

శృంగవరపు కోట లో బస్సు మలుపు తిరిగి బొడ్డవర వెళ్ళే మార్గం అందుకునే సరికి, సమస్త ఆలోచనలు మారి పోతాయి ఎవరికయినా.


ఆహ్లాదమయిన గాలి, ఏడాదికి మూడు పంటలు పండే పచ్చని పంట పొలాలు,  కళ్లాలు, చెట్టు చేమ, పశు పక్షాదులతో అద్భుతంగా దృశ్యం. 

ఎంత ఇంటి మీది బెంగతో వచ్చిన పిల్లాడికయినా కొంత ఊరట వస్తుంది ఆ దారిలో.

బొడ్డవర దగ్గర మలుపు తిరిగాక ఇంకో దృశ్యం. రెండువైపులా ఎర్రటి తురాయి చెట్లు, కడుపుకు తెల్లటి గవర్నమెంట్ పట్టీ తో కనిపిస్తాయి. 

నవోదయకు ఎదురుగా ఒక కొండ. ఆ కొండకున్న భావాలు ఎన్నో, వర్షాకాలం లో పచ్చటి తివాచీ కప్పినట్టు దట్టంగా చెట్లు. వసంత కాలం అడవి మల్లెల వాసన ఎలా ఉండేది అంటే, ఏ పుణ్య క్షేత్రం బయట పూల బజారులో ఉన్నట్టు వాసన. రాత్రుల్లో వెన్నెల కాస్తున్నప్పుడు అడవి మల్లెల వాసనకి కళ్ళంటా నిద్రపట్టేసేది. 

వేసవి వస్తే ముందు జీడి మామిడి పండేది ఆ వాసనకి పిల్లలు ఏమాత్రం తట్టుకోలేక పోయేవారు. గ్రీకువీరుడు రూపధరుడి లా ఆ సుగంధాన్ని తట్టుకునే శక్తి గల గట్టివాడు ఆ స్కూళ్లో పుట్టలేదు.

గోడ దూకి జీడి పళ్ళు తెచ్చుకుని తినే వారు. బకెట్ నిండా జీడి పళ్ళు తిని గొంతు పాడైనా వాటిని తిండం మానే ప్రసక్తి లేదు అన్నమాట.

గంగాధర్ హాస్టల్లో పాకలో ఉండే కుర్రాళ్ళకి, ఇంద్ర భవనం లా అనిపించేవి కొత్త భవనాలు. రూర్కీ విశ్వవిద్యాలయం సివిల్ ఇంజనీరింగ్ కాలేజీలో వేసిన డిజైన్. అన్నీ ఆలోచించి వేసిన మాస్టర్ ప్లాన్. 6 అబ్బాయిల డార్మిటరీలు, 2 అమ్మాయిల డార్మిటరీలు, 20 స్టాఫ్ క్వార్టర్లు. 

తాచుపాములాంటి కొత్త రోడ్లు. నియాన్ దీపాలు. ఎంటర్ అయిన కుడి వైపు అమ్మాయిల హాస్టల్. అనుకునే ప్రిన్సిపాల్ ఇల్లు. హాస్టల్లో ఒక్కో అంతస్తులో, ఒక్కో వైపు ఏడు కిటికీలు. పద్నాలుగు నాలుగుల 56 పిల్లలకి ఒక అంతస్తు. ఒక్కో అబ్బాయిల క్లాస్ ఒక అంతస్తుకు సరిపోయేది. 11-12 లో సైన్స్ మాత్రం ఉండడం వలన పిల్లలు తక్కువ కాబట్టి 6 డార్మిటరీల్లో సరిపోయారు పిల్లలు.  అలా స్కూల్లో ప్రతి విద్యార్థికి ఒక స్థానం దొరికింది అన్నమాట. 

విశాలమయిన రూములు, ప్రతి డార్మిటరీకి ఒక హౌస్ మాస్టారి గది. ఆ గదిలో యంగ్ ఫెలోస్ అయిన కుర్ర మాస్టర్లు ఉండే వారు, పిల్లల తోనే. 

కిట్టు కొత్త స్కూల్లో జాయిన్ అయ్యే సరికి, ఇంకా మంచాలు రెడీ కాలేదు. కిందనే పడక కోసం పరుపులు వేశారు. ఇద్దరిద్దరికీ ఒక గది లాంటి వసతి, గదులకు తలుపులు లేకుండా కేవల పిట్ట గోడలతో వేరు చేసి ఉండేవి.  

పిల్లలకి విశాలమైన రూములు కొత్తగా అనిపించాయి. పాత క్యాంపస్ లో ఎక్కడైతే 20 మంది ఉండేవారో అక్కడ ఇప్పుడు మహా అయితే నలుగురు ఉన్నారు. 



కిటికీ తీస్తే ఒక వైపు తూర్పు కనుమల అంచున పీఠభూమి క్రింద సేంద్రీయమనైన లోయ.  ఇంకో వైపు తూర్పు కనుమల అంచున ఉన్న కొండ ఉండేవి.

దూరాన చిన్న నీలి పొరలా బంగళాఖాతం. వర్షం వచ్చే సమయానికి దూరంగా ఉన్న మేఘాలు, నీటి దుప్పటి కప్పినట్టు నల్లటి నీలమేఘ  అశ్వాల్లా వచ్చిపడేవి.

 వైకుంఠపురంలో బాగా దగ్గర దగ్గరగా ఉండే లివింగ్ క్వార్టర్లు ఇప్పుడు దూరం అయ్యి కొంత ఆహ్లాదంగా ఉండేది పిల్లలకు. సమయానికి నీళ్లు కొలాయిలో రావటం పెద్ద వింతే.

చీకట్లో బకెట్ పట్టుకుని పాత స్కూల్ వెనుకాల, సూయేజ్ కాలువ దాటి, ఆరుబయట ప్రకృతి పిలుపు తీర్చుకునే పిల్లలకి ఈ బాత్రూములు ఒక పెద్ద విషయం. 

పాత క్యాంపస్ లో

క్లాస్ రూములు ఆశ్రమాలుగా కనిపిస్తే కొత్త చోట ఇంజనీరింగ్ కాలేజీయా అనే అనిపించేవి.

 క్లాసులతో పాటూ, నాలుగు ప్రయోగశాలలు. చిన్న క్లాసులకు ఒకటి, భౌతిక శాస్త్రం, కెమిస్ట్రీ, బయాలజీ కి వేరే వేరే గా లేబులు.

(కెమిస్ట్రీ ల్యాబ్ కు తాళం ఒకరోజు కిట్టు గాడికి ఇంకా దోస్తుకు ఇచ్చి సర్దమని చెప్పి వెళ్ళిపోయారు తాతయ్య మాస్టారు, అన్నిటికీ లేబుళ్లు వ్రాసే పని అప్ప చెప్పి. ఇది వీరే రోజు చెప్పే కథ).

కొత్త క్యాంపస్ లో ఇంకా కొంత కన్స్ట్రక్షన్ పని ఉంది పోయింది. క్యాంటాక్టర్ చిన్న పూరి గుడిసె లాంటి విసరబాటు గా ఉన్న చోట నిలబడి పని చేయించే వాడు. అలా పెద్దయ్యాక పని చేయించాలి అని, ఓపెన్ టాప్ జీపులో తిరగాలి అని, ఎంతోమంది పిల్లల ఆరాటం. 

కిట్టు తెల్లారగానే పీ. టీ తరువాత అడ్డ తోవన, అమ్మాయిల డార్మిటరీ ముందుగా నడుచుకుంటూ వెళ్తాడు కొన్నాళ్ళు. అప్పుడు మొదటిసారి తెలిసింది కిట్టుకి సౌకర్యాలు పెరిగినకొద్దీ, దూరాలు ఎలా పెరుగుతాయి అని. పాత క్యాంపస్ లో అమ్మాయిలు అబ్బాయిలు ఇంచు మించి కలిసే ఉండే వారు. 6వ తరగతి వాళ్ళు ఒకే బిల్డింగ్లో, ఒక తలుపు మాత్రం ఉండేది. ఇక్కడ కొత్త రూల్ పెట్టారు, అబ్బాయిలు అమ్మాయిల డార్మిటరీ ముందు గుండా కాకుండా వెనక నుండి వెళ్ళమని. మగ పిల్లలు వీస్తూ పోయారు, ఇన్నాళ్ళు కలిసి ఉండే రోజుల్లో వాళ్ళకి రాని తప్పుడు ఆలోచనలు ఇప్పుడు అకస్మాత్తు గా ఎలా వస్తాయో ఎవ్వరికి అర్థం కాలేదు. ఇదో పెద్ద విశేషం ఆ రోజుల్లో. 

అబ్బాయిలకు వేరే మార్గం, అమ్మాయిలకు వేరే మార్గం, అందాక కలిసి తినొచ్చు అంట. కొన్నాళ్ళకి వారికి వేరే మెస్ కూడా అంట. ఇంకా చూస్తుంటే గోడలు కూడా కడతారేమో అని నవ్వుకున్నారు. 

మెస్సు కూడా దూరం అయ్యింది, ఎల్లారావు వంటల వాసన స్కూల్ అంతా పాకేది పాత స్కూల్ లో. దారిన పోయే వారిని కొత్త చోట వంట ఏమిటి అని అడగటం కొత్త విషయం.

కొత్తగా స్టాఫ్ కూడా చాలా మంది వచ్చారు. మ్యాథ్స్ కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి చాకుల్లాంటి ఇద్దరు టీచర్లు. ఒకరు అమ్మాయి, కిట్టు కంటే 10-12 ఏళ్లు ఎక్కువ ఉంటాయి, టాపర్ అంట. ఇంకొకడు అబ్బాయి శివాజీ రావ్, పొడవుగా సన్నంగా చలాకీగా ఉండేవారు. ఇంకా ఇంగ్లీష్ కి ఒక టీచర్, మ్యూజిక్ కి ప్రత్యేకంగా ఒక గొప్ప శాస్త్రీయ సంగీత కుటుంబం లోంచి వచ్చిన మాస్టారు.  

తెలుగువారి పెళ్లిలో విందుకు వేసిన నిండు విస్తరిలా, పనగకు వచ్చిన కోనసీమ కొబ్బరి తోటలా, అన్ని హంగులతో వెలిగిపోతుంది నవోదయ నగర్... 

మొదటి రోజు, ఇంకా పిల్లలు వస్తుండగానే, ప్రిన్సిపాల్ సార్ హనుమాన్లు ఆర్ట్ మాస్టారు కలిసి రెండు పొడవాటి కర్రల ఆసరాతో, పెద్ద బోర్డ్ పెట్టారు... 

అందరికీ కనిపించేలా గుమ్మం మీదే రాసి పెట్టారు. ఆకుపచ్చ బోర్డ్ మీద గుమ్మడి కాయలంత, తెల్లటి అక్షరాలతో,  "ఎంటర్ టు లెర్న్, లీవ్ టు సర్వ్" , అభ్యాసానికి లోపలికి రావాలి, సేవ చేయడానికి బయటికి వెళ్ళాలి. 



ఏడేళ్లు ఈ కొత్త క్యాంపస్ కోసం ఎదురు చూసిన ఆ మొదటి 1988 బ్యాచ్ విద్యార్థుల పేర్లతో పుస్తకాలు, వారి ట్రోఫీలు ఆప్యాయంగా ఛాంబర్ బయటే పెట్టారు. చెక్క బోర్డు మీద పెద్ద అక్షరాలతో 12 వ తరగతి ర్యాంకుల్లో జాగరాపు జవహర్ అని రాయిస్తున్నారు. ఇంకా తెలుపు రంగు ఆరలేదు. 

హనుమాన్లు స్కూల్ లో గోడలమీద రాసారు ఇంగ్లీషులో, "జీవితంలో మొదటి సారి చూసినట్టు లేక చివరిసారి చూస్తున్నట్టు చూడాలి అన్నిటిని" అని.

రాబోయే దశాబ్దాలలో నవోదయ నగర్ లో ఎందరో కిట్టు గాళ్ళు, రుక్మినులు, అనితలు, వనితలు, భామలు, కిరణ్లు, శేషులు, చక్రిలు వస్తారు. 

వందల్లో రాములు, శ్రీనులు, జ్యోతులు,  అవినాష్లు, అరవిందలు, జగదీశ్ లు, ఆశలు,  ఆశాజ్యోతులు, మాధవీలు, రహీంలు, సాయిలు వస్తారు. అందరూ పెద్దయి వెళ్ళిపోతారు ఒక్క మోట బావిలో మరణించిన అన్నయ్య తప్ప. ఆ రోజు అందరిలాగే వచ్చాడు శ్రీధర్, కొన్నాళ్ళకి అక్కడే కాలం వేసే గేలం తెలియక. తన కాబోయే శ్రీవారికి అన్నం వడ్డించే 11 ఏళ్ల అమ్మాయి కి ఇంకా తెలీదు తన గుండె లో ఒక భాగం ఎదుటే ఉంది అని. దేశం కోసం కంచుకోటలా ధైర్యం తనకుందని తెలీదు ఇంకొకరికి. ఎందుకంటే ఇది బాల్యానికి ఒక పేద దేశం ఆశలతో కట్టిన గుడి. 

వారికి ఆనందం, సుఖం, దుఃఖం, ఆకలి, తృప్తి,  స్నేహితులతో ప్రేమలు, గిల్లికజ్జాలు, వియోగాలు, వీడ్కోలులు, జరిగేవి ఇక్కడే. దీపావళి నుండి, వాలెంటైన్స్ డే వరకు, కొంతమందికి యానివర్సరీలతో పాటు జరిగేది ఇక్కడ. స్నేహితులని కలిసిన వాళ్లు కొంతమంది, కుటుంబ సభ్యులని కలిసిన వారు కొంతమంది. 

ఇక్కడే పుడతాయి తీపి గుర్తులు, చేదు పాఠాలు, చెంప దెబ్బలు.  చెమ్మగిల్లిన కళ్ళు, కేరింతల నవ్వులు. లెక్కలేని ఉదయాలు, లెక్క కట్టలేని అనుభవాలు. 

ఇది భావి వ్యక్తల, బోధకుల, కళాకారుల, సిపాయిల, సేవకుల, వైద్యుల, ఆసాముల కర్మ భూమి. 

వారందరికీ పుణ్య భూమి, జన్మ భూమి.

నవోదయ వైకుంఠపురం ఇప్పుడు పాలెం మారినా, ఆ విలువలు, ఆ అనురాగాలు అలానే వచ్చేశాయి పిల్లల ట్రంకు పెట్లలో.....  

మధ్యాహ్నం గంట మోగింది కిట్టు 521 ప్లేట్ పట్టుకొని మెస్ కు చేరాడు. 

"అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ।

ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్" 

అగ్నిలా అన్ని దేహాల్లో ఉండి, జీర్ణం చేస్తున్నాను అంటున్నారు పిల్లలు, ఆ విష్ణు మూర్తి అంశలు. 

ఆ రోజు ఆ మహా నవోదయ చరిత్ర లో ఒక పేజీ తిరిగింది. అక్కడ ఒక నెమలి ఈక పెడదాము అందాక. మధ్య మధ్యలో కథలు అక్కడికి పోక మానవు. 

ఇంక కాలంలా కథ ముందుకు సాగాలి. 

వెల్కమ్ టు నవోదయనగర్.

1995 జూన్.

హాల్లో మిస్టర్ హనుమాన్లు

 *** హాల్లో మిస్టర్ హనుమాన్లు***


అనగా అనగా కిట్టు గాడు 9th కి వచ్చేశాడు. ఒక సారి వాళ్ల అమ్మ గారు వాణ్ణి నయాన భయాన విద్యాలయకు తెచ్చారు జనవరి సెలవుల తరువాత.


వాణ్ణి డార్మిటరీ లో పెట్టి చక్కా వెనక్కి పోతున్నారు. జనవరి నీరెండలో నిలబడిన ఆవిడకి దూరంగా ఆయాసం తో పరుగెడుతూ ఆంజనేయులు కనిపిన్చారు.


హనుమాన్లు గొప్ప కళాకారుడు. ఎలాంటి చిత్రాన్నయిన సునాయాసం గా వేసే వారు. బొమ్మల కన్నా వాటికి అద్భుతమైన ఆయిల్ కలర్స్ వేయడం ఆయనకు మంచి సరదా. పిల్లల శ్రద్ధకు తగిన విధంగా చెప్పుతూ వచ్చేవారు. అరవింద్, ప్రతాప్ లాంటి 

మంచి పేరు ఉన్న ఆర్టిస్టులకు ఇంకా ప్రత్యేకంగా నేర్పేవారు.


కానీ స్కూళ్ళలో ఆర్ట్ మాస్టారిని, పెయింటర్ గాను, క్రాఫ్ట్ మాన్ గాను వాడుకునే వారు. తగతో గదుల పేర్లకు, అప్పుడప్పుడు తలుపుల ద్వార బంధాలకు వర్ణీష్ కూడా వేయించేవారు ఆయన చేత. 


అయినా చెరగని నవ్వుతో ఉండేవారు మాస్టరు. 


మాస్టారు బాగున్నారా, చాలా రోజులయింది అన్నారు ఆవిడ. మీరా కిట్టు మదర్ కదా. చాలా రోజులయింది, కలిసి. మీ వాణ్ణి 3 ఏళ్ల క్రితం, మీ ఇంటి దగ్గర గిరఫ్టార్ కోసం కలిశాం మేడం అన్నారు. 


అమ్మ గారు కొంచెం తడపడాయించారు. ఔన్సార్ మీ దయ వలన ఇప్పుడు అడ్జస్ట్ అయ్యాడు అన్నారు. 


ఏమి దయండీ ఆ దెబ్బకు నాకు ఇంకా ఇంక్రిమెంట్ రాలేదు అన్నారు. కిట్టు అమ్మకి గొంతులో కరక్కాయ పడింది. 


ఇంకా బస్సు రాలేదు అని అక్కడున్న మూక మెల్లగా నెక్స్ట్ జంక్షన్ కి నడక మొదలెట్టారు. 


కిట్టు అమ్మగారు వెంటనే హనుమాన్లు నడక మొదలు పెట్టారు. 


తదుపరి 40 నిమిషాలు కిట్టు గాడి వల్లన తన జీవితం ఏమేమి మలుపులు తిరిగినదో చెప్పడం మొదలు పెట్టారు.


మేడం గారు మీ వాడు మంచోడే గానీ నాకు పట్టిన పెద్ద గ్రహం అన్నాడు. అదేంటండి అని అడిగే లోపే, మీకు కాబట్టి చెప్తాను, ఇప్పుడు బొడ్డవర వెళ్ళడానికి ఒక రకంగా కిట్టూ యే కారణం అన్నారు. ఎలా సార్ అంటే.. 


మీకు తెలీదు గానీ నేను 5 ఏళ్ల క్రితం బాగా బతికే వాణ్ణి మేడం. ఏదో కొన్ని కారణాల వల్లన నాకు ఇద్దరు భార్యలండీ. పెద్ద ఆవిన్ని విజయనగరం లో నీ చిన్నావ్వీన్ని స్కూల్లోనే ఉంచి బాగే నడిపే వాన్ను. నన్ను తప్పుగా అనుకో వద్దు చిన్నావిన్ని తండ్రి పోయాక ఆదు కోడానికి చేసుకోవలసి వచ్చింది అన్నాడు. 


దీనికి తన బంగారం కిట్టు గాడికి ఏమిటి సంబంధం అనేలోపే, ఇలా చెప్పు కుంటూ వచ్చాడు. 


1994 లో దసరా నీకు గుర్తుందా అన్నాడు. అమ్మ అయోమయం గా చూసింది. హహ మీకు ఎందుకు ఉంటుంది మేడం. ఆరోజు మీ వాడు పారిపోయి మీ ఇంటికే వచ్చాడు. గుర్తొచ్చిందా అన్నాడు. 


ఔను ఔను సార్ వచ్చింది అన్నారు ఆవిడ. ఎప్పుడు నేను జూనియర్ ని మేడం, రెండో ఆవిడ తో పెళ్లి అయిన కొత్త. ఆవిడ స్కూల్లోనే ఉండేది నాతో, ఇంట్లో పరిస్థితులు బాగోక. ఇంకో నెలలో ప్రమోషన్ వస్తుంది ఆవిడని బయట ఇంట్లో పెడదాం, ఈ మాట పొక్కక ముందు అని నా ప్లాన్ అన్నమాట. 


దసరా కదా, ఆ ఒక్క రోజు హౌస్ మాస్టర్ గా ఉండమని నన్ను ప్రత్యేకంగా అడిగారు పిర్న్సిపాల్ సార్. ఆయనను కొంచెం ఇంప్రెస్స్ చేస్తే మంచి ఇంక్రిమెంట్ ఇంకా ఊళ్ళో మంచి పేరు వస్తుంది అని వప్పుకున్నాను. అయినా నల్ల బళ్ళలకు పెయింటు, పిల్లల బూట్ల మీద పేర్లు రాయించడం ఇల్లా నన్ను బాగా వాడేసుకుండే వారు మేడం. ఇది నాకు పెద్ద ప్రమోషన్ లా అని పించింది.


మీ కిట్టు ఉన్నాడు చూసారు, ఆ రోజు మధ్యాహ్నం కక్కా ముక్కా తిని  మాట్లాడుకుంటూ ఉండి పోయాను. మీ వాడు బల్లి లాంటి మనిషండి, ఎప్పుడు పోయాడో తెలీదు జంప్ అయిపోయాడు.

 principal వచ్చి నన్ను అడిగారు attendance వేసావా అని. కొంచెం భయానికి వేసాను అనేశాను. కిట్టు లేడా అని అడిగారు, ఒక గంట వెతికినా వాడు దొరకలేదు. అసలే అల్ప ప్రాణి ఎక్కడ పడిపోయాడు అని బాగా వర్రీ అయ్యాము. పోలీస్ స్టేషన్ కి ఇంక ఫోన్ చెయ్యాల్సి వచ్చింది. అలా రోజంతా వెతికితే మీ ఇంటి మటన్ తింటూ దొరికాడు.


ఏక బికిన చెప్పిన కారణం గా ఆయాసం వచ్చేసింది ఆంజనేయులు కి. చిన్న పిల్లాడు .... అని అనే లోపే మళ్ళీ చెప్పడం మొదలు పెట్టాడు. ఆ రోజు principal నాకు మెమో రాశారు మేడం. 

*" హనుమాన్లు అనబడు ఆర్టు మాస్టారు+3768 క్ర.సం.) ఈ రోజు తన విధి నిర్వహణలో ఆశ్రద్ధ మూలం గా ఒక విద్యార్థి పారిపోయిన కాలాన్ని గ్రహించ లేక పోయారు. ఇంకనూ తను రోల్ కాల్ వేసినట్టు అబద్దం చెప్పి తన దోవన కుటుంబ కార్యక్రమాల్లో మునిగి విధి నిర్వహణ లో విఫలం చెందారు"*


ఇలా jobu లోంచి ఒక కాగితం చూపించారు. అది జేబులో ఎందుకుంది అనుకుంటున్నారా, ఆ ప్రమోషన్ కోసం దీని నోటరీ చేయించడానికి వెళ్తున్నాను మేడం.

 అయ్యో సారి sir అన్నారు ఆవిడ. ఇది sorry to పోయేదా మేడం. ఆరోజు సాయంత్రం మా రూంలో చుట్టాలు ఉండడం వల్లనే నేను నిర్లక్ష్యం చేసాను అని principal నా రూం కి రావడం, వనజను పెద్దావిడ వరలక్ష్మి అనుకోవడం. ఆవిడ నేను వనజ అని చెప్పడం , నా చిన్నిల్లు బయట పడడం. ఆ దెబ్బకు వనజ నన్ను వదిలి పుట్టింటికి వెల్లడమూ ఆ గొడవల్లోన్చి బయటకు రావటానికి నాకు మూడేళ్లు పట్టింది మేడం అన్నారు ఆంజనేయులు .


అందుకే కిట్టు నాకు పట్టిన గ్రహణం మేడం, నా ఒక్కరికే కాదు

మీ వాడి వలన ఇంకో ముగ్గురికి incementlu, పెళ్ళిళ్ళు, హౌస్ రెంట్ allowance ఆపేశారు. 

 అన్నిట్లో నూ అయితే ముందు లేకపోతే చిట్ట చివరా ఉండి మమ్మల్ని బంతాట అడ్డేస్తున్నాడు..


అంతటి రాక్షసుణ్ణి మీరు ఎలా పెంచారు మేడం , మీకు దండం పెడతాను వాణ్ణి 11th కి బయటకు తీసుకు వెళ్ళండి అని మొర పెట్టుకున్నారు ఆంజనేయులు.

పోనీ వాణ్ణి పట్టుకు కొడ దామని నిర్ణయించు కున్నానా, మొన్నే న్యూఢిల్లీ లో ఎగ్జిబిషన్ ర్యాంక్ తెచ్చుకుని, పేపర్ వాడికి *హనుమాన్లు నాకు ప్రేరణ అని చెప్పాడు*. జోబులోంచి ఇంకో కాగితం తీసి అందులో చూపించాడు " for exceptional mentorship of students in national festival హనుమాన్లు ఈస్ requested to receive special certificate and training from samiti"

ఇలా ఒక నెల మెమోలు ఒక నెల ప్రోత్సాహ సర్టిఫికేట్ లు తీసుకుంటూ. ఈ రోజు ఎటు వైపు పోతుందో తెలీక నా బోటి వాడి పరిస్తితి ఎలా ఉందో మీరే గ్రహించాలి అంటూ, ఆకాశం లోకి చూస్తూ ఉండి పోయాడు హనుమాన్లు !!

హౌరా రైలు

హౌరా రైలు


మరునాడే మైగ్రేషన్ పిల్లలు , అంటే ప్రతి సంవత్సరం హర్యానా నుండి ఆంధ్రా వచ్చిన పిల్లలు, అసెంబ్లీ కి వచ్చారు. 

ఇది కొత్తదనం చాలదు అన్నట్టు. ఆ రోజే కొత్త పిర్న్సిపాల్ కూడా వచ్చారు. 

ఈయన పద్దతి వేరుగా ఉంది. రవీంద్ర నాథ్ ఠాగూర్ లాగ గెడ్డం, పెద్దల తరహా కళ్లద్దాలు , చాలా హుందాగా ఉన్నారు ఈయన. ఆయనకు ఒక తెల్లటి మారుతీ కారు, ఇంగ్లీషు టపా టపా మాట్లాడే bobbed హెయిర్ మిసెస్, చక్కటి హావభావాలతో ఒకే ఒక్క అమ్మాయి. చూడగానే వీరు హుందాగా అనిపించే కొత్త ప్రిన్సిపాల్. 

గెడ్డాన్ని సవరిస్తూ, మంచి ఇంగ్లీష్ లో ప్రసంగం. దేశ సమగ్రతకు మైగ్రేషన్ ఎంత గొప్ప అవకాశమో క్లుప్తంగా చెప్పారు. పిల్లల్ని అభిమానంగా ఆహ్వానించాలి అని, ముఖ్యంగా 9వ తరగతి పిల్లలు కలిసి మెలసి ఉండాలి అని. 

క్లాసులోకి వస్తున్నారు పిల్లలు. 9A. కిట్టు కూర్చున్నాడు తన బల్లమీద. గుమ్మం దగ్గర సానియా. ఎదురుగా  చూసి, హలో అన్నాడు వెల్కమ్ వెల్కమ్ అంటూ. 


అలా రోజూ తనతో పరిచయం. మధ్యాహ్నం లంచ్ తరువాత రోజూ భామా, రుక్మిణీ తో మాట్లాడే కిట్టు ఇప్పుడు వేరేగా సానియా తో మాటలాడటం మొదలు పెట్టాడు. ఇలా లంచ్ బ్రేక్ లో మాట్లాడే వారిని టెంట్ అని కొత్తగా పేరు పెట్టారు. టెంట్ అంటే ఏమిటో నిర్వచనం ఇవ్వడం చాలా కష్టం. 

టెంట్ ఎక్కడయినా పడొచ్చు. క్లాస్ బయట, లోపల, మెస్సులోపల, బయట, ఎవరయినా పెట్టొచ్చు.  చివరకి నర్స్ మేడం లెక్కల మేశారు, పిన్సిపాల్ మేడమ్ వైస్ ప్రిన్సిపాల్ ఎవరయినా పెట్టొచ్చు అన్నమాట. 

అదొక నిర్వచనాతీత ఫినామినాన్. ఉదాహరణకి నర్స్ మేడం దగ్గరికి ఒక పెద్ద అన్నయ్య తల నొప్పని, కళ్ళు తిరుగుతున్నాయి అని వెళ్ళాడు అనుకోండి, ఆ ఫలానా నర్స్ ఆయన చెయ్యి పట్టుకుని రీడింగ్ చూస్తూ ఒక గంట మాట్లాడారు అనుకోండి. అది కూడా టెంట్ గానే వస్తుంది, "నా చెయ్యి తాకింది నర్సు మేడం, నవ రాగంలో నవ్వింది నర్సు మేడం" అని పాటలు కూడా పాడొచ్చు. 

సంగీతంలో రాగానికి నిర్వచనం లేనట్టు, నవోదయాలో జరిగే టెంట్ అనే సరగానికి నిర్వచనం లేదు. అది అలా జరిగిపోతుంది అంతే. 

కుట్టు_సానియా టెంట్ మిగతా టెంట్ల వలే, ఒంటి గంటకు ఠన్చన్గా పడుతుండేవి. భామకు కూడా ఒక వీరాభిమానితో వేరే టెంట్, రుక్మిణికి వేరే వీరాభిమానితో టెంట్ ఇలా. 


రోజూ కిట్టు చూసే వాడు తన బెల్టు వెనక్కి ఇస్తుందా అని. ఇన్సర్ట్ లేదు అని, బెల్టు లేదు అని చాలా దెబ్బలు తిన్నాడు pt చేతిలో. స్కర్ట్ సైజ్ చేయించే అవకాశం లేదు అనిపించేది కిట్టుకి ఎందుకంటే టైలర్ ఇంకా రాలేదు స్కూల్ కి. అడుగుదాం అనుకునే వాడు, కానీ పాపం అనిపించేది. డిల్లీ— చండీఘర్ ప్రయాణంలో తనకు కలిసిన అరుణాచల్ ప్రదేశ్ అమ్మాయి గుర్తుకు వచ్చేది. తను హోమ్ సిక్ అయి ఏడుస్తూనే ఉంది మొత్తం ఎక్సిబిషన్ అంతా.  మొదటి అక్షరాలు కలిసి AP నుండి తను కూడా అని చెప్పాడు కిట్టు. ఆమాత్రం కలిసినందుకు రోజూ తనతోనే మాట్లాడేది ఆ అరుణాచల్ నవోదయ అమ్మాయి. 


ఒక రోజు సానియా తనే వచ్చింది , ఖాళీ క్లాస్ రూమ్ లోకి, చిన్న సంచితో. కొత్త బెల్ట్. ఇది నిజమయిన తోలు బెల్టు, మంచి మెరిసే buckle.

thank you చెప్పింది. మొహంలో అభిమానం. సహాయానికి ఆరోజు ఇచ్చిన ఆసరాకి.


 కిట్టు Khade Ho అంది. నిల్చున్నాడు. వెనక్కి తిరగమని,  ఇప్పుడు ఇన్షర్ట్ చెయ్యి అంది. బెల్టు తనే పెట్టింది, చాలా చనువుగా. 

అనాలోచితంగా, ఈ సారి కిట్టు ని తను కళ్లలోకి చూసింది. ఈసారి ఇద్దరికీ అమాయకత్వం కాదు, స్నేహం కాదు, ప్రేమ కనిపించింది. కళ్ళు ఒకరినొకరు కళ్ళను వెతుకు తున్నాయి. కలవలం పడుతున్నాయి.  

ఐ లవ్ యూ ... ముందు తను, మాట మధ్యలోనే కిట్టు కూడా. చేతిలో చెయ్యి మాత్రం పెట్టారి ద్దరూ..

గుండెల్లో హౌరా రైలు ప్లాట్ఫారం మీదకు వచ్చినప్పుడు ప్లాట్ఫారం కదులుతుందే అలాంటి దడ. వెన్నులో పుట్టి తల పైకి వెళ్ళిన మెరుపు లా ఉంది ప్రేమ. 

ఆ క్షణం, ఆ చోట, అలా సమయం స్తంభించింది. 

1+1 = 1

సానియా జావేద్

 సానియా జావేద్ 

అది తొమ్మిదో తరగతి విషయం. సెలవుల్లో అమ్మా నాన్నా డబ్బులు లేకున్నా జనతా టికెట్టికి తిరపతి తీసుకెళ్లి గుండు కొట్టించేశారు కిట్టూకి. ఎండాకాలంలో గుండు తో బాగా ఇబ్బంది పడ్డాడు కిట్టు. ఈ రెండు నెలల్లో ఎత్తు కూడా బాగా పెరిగాడు.

 స్కూల్ మొదలయిన మొదటి రోజు, కొత్త క్లాస్ రూంలో టీచర్ బెంచీ మీద వంగి హోంవర్క్ చేస్తుండగా రుక్మిణి వచ్చి అన్నాది, అబ్బాయ్ "చాలా పెరిగిపోయావ్" అని. చాలా వత్తుగా అంటూ. వెనకాలే భామ, "మొహం చూడకుండానే"  అని వెటకారం. అన్న మాట మామూలే అయినా మాటలో ఏదో చిలిపితనం ఒక అల్లరి. ఆయిద్దరి పక్కకి వచ్చి తన ఎత్తు చూపించాడు. నీ కొత్త చెప్పులు వలన లే నువ్వింకా అంతే అంటూ ఆట పట్టించింది రుక్మిణి. వాళ్ళని దాటి ఎదిగిన కిట్టు కొంచెం గర్వంగా ఫీల్ అయ్యాడు.  

కొన్ని రోజుల్లో, సాయంత్రం ఆటల్లో ఆడుతూ దాహానికి పెద్ద స్కూల్ బిల్డింగ్ వద్దకు వస్తున్నాడు కిట్టు. అమ్మాయిలను రన్నింగ్ చేయిస్తున్నారు. కొత్తగా అమ్మాయిలు కనిపిస్తున్నారు — హర్యానా వాళ్ళు రావడం వారితో రన్నింగ్ చేయించటం అప్పటికే మొదలయ్యాయి అని అర్థం ఔతుంది. 

ఒక కొత్త పిల్ల మాట మాటికి ఆగిపోతుంది. మేడం వచ్చి తెలుగు లో  గసిరి , "జాయిన్ ద క్లాస్" అని గర్జించి వెళ్ళింది. అలా రెండు సార్లు అప్పటికే అయ్యింది. ఆగిన ప్రతిసారి తను స్కర్ట్ పైకి లాగి మళ్ళీ వెళ్తుంది. లూజ్ గా ఉన్నట్టు, స్కూల్ పంచిన బట్టలు సైజ్ తప్పు అన్నట్టు ఉంది. తను కూడా వాటర్ కోసం వస్తుంది స్కూల్ వైపు. 

కిట్టు నీటి గొట్టం (గొట్టం అంటారు కానీ అది ఒక డ్రం అన్న మాట) దగ్గర మంచి నీళ్లు తాగుతున్నాడు. క్షారం గా ఉండేవి కిల్తంపాలెం నీరు. తను తాగి తనకి అవకాశం ఇస్తున్నాడు. ఆ పిల్ల వెళ్ళాక మొహం కడుక్కుందాం అని ఆగాడు. కొంత కుతూహలం కూడాను ఎలాంటి అమ్మాయి అని. 

అమ్మాయి వచ్చింది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఏడుస్తుంది గాబోలు కాటిక చెదిరి ఎర్రటి బుగ్గలకు అంటుకుంది. ఈ మేఘం లేని సాయంత్రం, ఒక్క నల్లటి మేఘం పడమటిన కనిపించినట్టు, చెదిరి బుగ్గలకు అంటుకున్న కాటుక ఆ అమ్మాయి బుగ్గల రంగును ఇంకా పెంచేస్తుంది.

కిట్టు గ్లాస్ చూపించాడు, తను తాగుతుంది. ఉంగరాల జుట్టు చెదిరి కళ్ళలోకి పడుతుంది. గుటక వేస్తే గొంతులో అలల లాగా కనిపిస్తుంది. రవి వర్మ వేసిన తెల్లటి చీరలో దేవతలా ఉంది ఆమె కంఠం. అందాల రాశి, అలివేణి, కోమలి అని అర్థం ఔతుంది. 

నీళ్ళు ఎత్తిపోసి తాగుతూనే, తనకి కళ్ళల్లో కన్నీళ్ళు ఉబికి ఉబికి వస్తూనే ఉన్నాయి. పాపం అని, జాలితో కూడిన 

అనుభూతి వేసింది కిట్టూ కి. 

తను కిందటేడాది డిల్లీ వెళ్లిన అనుభవం గుర్తుకు వచ్చింది. ఈ ఊరికి ఆవూరు ఎంత కష్టమో, ఆ ఊరికి ఈవూరు అంత కష్టమని అనుకున్నాడు. 


స్కర్ట్ నిజంగానే లూస్గా ఉంది. మాట మాటికి లాక్కుని ఉంటుంది తాను. 

మొహం మీద ఏదో ఉంది అని హిందీలో చెప్పాడు. తను మొహం కడుక్కుంది, కాటుక ఇంకా స్ప్రెడ్ అయ్యింది. తనే చేత్తో చూపించాడు, మళ్ళీ కడిగింది పోలే, కిట్టు అనుకోకుండానే చేత్తో తుడిచాడు. చేతికి కాటిక అంటింది. గోడకు రాసాడు. 


ఆ పిల్ల పక్కుమని నవ్వింది. 

ఇద్దరూ నవ్వారు . తను నవ్వింది చివరికి, కిట్టుకి ఆనందం.  

ఈసారి కిట్టు చనువుగా తుడిచేసాడు తన కళ్ల పక్కన ఉన్న కాటుకను. కళ్ళు కళ్ళు కలిశాయి. ఒక్క క్షణం అలాగే ఉండిపోయాయి.  కళ్ళల్లో అమాయకత్వం స్నేహం మాత్రం చూసారు. 


స్కర్ట్ లూజు ఉందా అని అడిగాడు. హిందీ లో.  హా.. అన్నది తను. కిట్టు తన బెల్ట్ చూపించాడు. పెట్టుకుంటావా అని, సరే అని తల ఊపింది. కిట్టు వెంటనే తీసి ఇచ్చాడు తనకు.

విజయనగరం గంటస్తంభం దగ్గర తోపుడు బండి మీద కొన్న బెల్టు.  దానికి మామూలు కొక్కెం కాదు ఒక వింత ప్రెస్ ఉండేది. కిట్టు కొన్నదే అందుకు. అమ్మాయికి పెట్టుకోవడం రాలేదు. 


బిత్తర పోయి చూస్తుంది. వదిలి వెళ్తే మళ్ళీ తిట్లు, మేడం కొట్టినా కొట్టొచ్చు. 

కిట్టు బెల్ట్ మీద చెయ్యి వేశాడు — సిగ్గు పడుతుంది పిల్ల — వీడికి అంత సందర్భావగాహన లేదు — దగ్గరికి చేసి నొక్కి చూపించాడు. 


చక్కగా సరిపోయింది స్కర్ట్ మీద బెల్టు, స్కర్ట్ ఫిట్ అయింది. 

ఒక్క సాయంత్రపు చిరుగాలి కొండ మీద నుండి వాచిలో టైమ్ చూసుకుని, తలుపు తట్టి వచ్చినట్టు, కిందకు వీచింది. ఆమె మొహం మీద చిరు నవ్వు.

మేరా నామ్ కిట్టు...

తుమ్హారా నామ్ ? అన్నాడు...

సానియా 

సానియా జావేద్

అలా అలలా మొదలయ్యింది, తొమ్మిదో తరగతి. 


1997 జూన్, నవోదయ నగర్, కిల్తంపాలెం.

అలలు

అలలు

తరంగాలా ఈ మనుషుల అలలు

వీరి అంతరంగానిది ఏ దిశో 

ఏ దిశలో ప్రవహిస్తుందో


తరతరాలుగా మారుతూ…

తారా లోకం కనిపించిన

వీరి కన్నుల్లో

 పుడుతుందా జిజ్ఞాస ? 


ఎవరో ఒకరి స్నిగ్ధ

నిశ్శబ్ద రాత్రిలో

మిణుగురులు

నింగిని తాకిన 

ఆ క్షణంలోనే

పుట్టేను కదా  ఆ ప్రశ్న


“తారలేమిటి?”

ప్రశ్నలలోనే పుట్టి,

ప్రశ్నలతోనే పెరిగి,

మరో చరిత్రను రాసే

మరో మానవ తరాన్ని

తారల వైపు నడిపించే

మహా మనీషి 


ఆమె చేసిన వంటలో

రేడియం వెలిగితే,

అతను చేసిన లెక్కల్లో

సమయం వంగిపోతుంది కదా


చిన్న క్షణాల్లోనే

విశ్వం తన రహస్యాలు చాటుతుంది…


తరాలు తరాల్ని మేల్కొలుపుతూ,

తరంగాలై సాగుతూనే ఉంటాయి

తారా లోకాన్ని అందుకునే

ఆ తారా తీరాన్ని

వెదుకుతూనే ఉంటాయి.

దాహం

దాహం



దహన  యోగః 

దేహం

మరి ఎందుకోసం 

దాహం ?


నారీ స్థన భర 

నాభీ దేశం

ఎందరికో 

వ్యామోహం


పురుష బాహుః

కరిగేటందుకు

దేహం చేసే 

కనికట్టు


అతనయినా

ఆమయినా

దేహం చేసే ఈ

మాయాజాలం


శీర్యతః శరీరం

మరి తప్పదెందుకు

అందరికీ

శరాఘాతం ?

రాముడికి ఛార్జ్ షీట్

 రాముడికి ఛార్జ్ షీట్ 


ఎవరు కొలిచారయ్య

ఈ రాముని

ఏమి చెప్పుకోవాలి

ఈ రాముని

నమ్మిన వారికి

చెంప చెల్లు

చేసే ఈ రాముని


ఎవరు కొలిచారయ్య

ఈ రాముని

ఏమి చెప్పుకోవాలి

ఈ రాముని


నమ్మిన వారికి

చెంప చెల్లు

చేసే ఈ రాముని


మొదటి బాణాన

తాటకి నీ

నీ పట్టుదలకు

నీ తల్లినీ

నీ గొప్ప కోసం

ఆలినీ

నీ సొగసు పొగరికి

కన్యనీ

నీ దోస్తు కోరికకు

తారని బలిచేసినావే


నిన్ను కన్న వారికీ శిక్షే

నిన్ను కోరిన వారికీ శిక్షే

నిన్ను పెళ్లాడిన వారికీ శిక్షే

నీ అంగరక్షణకు తమ్ముడినీ

నీ వంట కోసం సీతని

తోడు తీసుకెళ్ళ

రామ చంద్రా

నీ అంత కరుణ

నా కొద్దు

రామ చంద్రా


అన్న దమ్ములను

బతిమాలి బామాలి

ఒప్పింతు వా

ఒక్కరిని చంపుతువా

రాజ వంశీభవడివి

ముగ్గురు తల్లుల పుత్రుడివి

వరించిన కన్యను

ముక్కు కోసివేతు వా

స్త్రీ మనసును ఒప్పించి

సహనానితో మనసు మార్చలేవా

రామ చంద్రా

నీ ప్రేమ

నాకొద్దు

రామచంద్రా


ముసలి

శబరికి ఏమిచ్చావయ్య

రామ చంద్రా

పోతూ పోతు

ఒక పూరిళ్ళు

కట్టి పోవాలని

అనిపించలేదా

రామ చంద్రా

నీ అంత కరుణ

నా కొద్దు

రామ చంద్రా


కోతులను

ఎలుగుబంట్లన్

జటాయువలన్

ఉడతలు

వాడు కుందువు

రామ చంద్రా

వారికేమీ

చేసావు

రామ చంద్రా


గుప్పెడు కూడేనా

పెట్టావా

వారి నొప్పినేమన్న

తగ్గించావా

రామ చంద్రా

నీ అంత జాలి

నా కొద్ది

రామ చంద్రా


నీ నీడ పడిన

స్త్రీలంతా

ఆంఫట్టు

రామ చంద్రా

పెళ్ళాడి పదిమూడు

ఏళ్లు నీవెంట తిరిగిన

నిండు చూలాలిన్

తగిలి వేసావే

ఎంత స్త్రీ జన

దయామయుడివయ్యా

రామ చంద్రా

నీ అంత స్త్రీ కరుణ

మా కొద్దు

రామ చంద్రా


రామదాసుకెన్ని

సుఖాలు ఇచ్చావే

రామ చంద్రా

నిన్ను నమ్ముకున్న

కబీర్ గాని

తులసీదాసు గాని

మీరాబాయి గాని

వారే వరయి నా

సుఖ పడునా

రామ చంద్రా

నీ అంత దయాగుణం

నా కొద్దు


రామ చంద్రా

మర్యాదకు

మారు పేరు

రామచంద్రా

అది నీ మర్యాద వరకే

పరిమితమ

రామ చంద్రా

తల్లుల, స్త్రీల

భక్తుల, ఉడుతల

కోతులకి

మర్యాద లేదేమి

రామ చంద్రా

నీ అంత దేవుడు

నా కొద్దు రామచంద్రా


పునరపి...

పునరపి... 

నవోదయ వైకుంఠపురం లో జరిగిన ఘట్టం.




గొంతులో శివుడు గరళం దాచినట్టు. కిట్టు తన పొట్టలో ఒక చేదు నిజాన్ని దాచాడు, అది వాడికి పుట్టుకతో వచ్చిన దోషం. చిన్న పేగు చివరికి 2 అంగుళాల దూరంలో, 2 సెంటీమీటర్ల పరిమాణంలో ఉంది ఒక అవశేషం. అది ఉండేది 100 లో ఇద్దరికి, గాని అది నొప్పి కనిపించేది ఇంకో 200 లో ఇంకొక్కరికి.

ఎప్పుడో సరదాగా ఆడుకునే సమయంలో నో, చదువుకునే మధ్య లోనో , ఒక చిన్న నొప్పి మొదలయ్యేది. అది రాగానే వీడికి చిన్న అనుమానం మొదలయ్యేది. బంగాళాఖాతం లో అల్పపీడనం, వాయుగుండమై, వాయు గుండం తుఫానుగా, తుఫాను పెను తుఫానుగా మారే ట్టు ఒకోసారి అది పూర్తిగా మనిషిని విసిరి పరేసేది. కానీ ఒకడి సారి చెడుమదురు గాలి లా తనంతట తాను పోయేది. 

ఎవ్వరితోనూ చెప్పుకోలేని బాధ. చెప్పినా వినే వారికి అర్థం కాని బాధ . బయటికి ఏమి కనిపించదు నొప్పి తార స్తాయికి చేరే వరకు. 

నోట్లో నీరు కూడా పోసే ప్రసక్తి లేదు, లాలాజలం కూడా మింగితే  బయటి కి వచ్చే బాధ. ఊపిరి తప్ప తీసుకోలేని నొప్పి. కుప్ప కూలేవాడు ఒక చోట.

 విశ్వానికి ఒక గడియారం ఉంటే , ఆ గడియారం లోలకం నెమ్మదైనట్టు ఉండేది. ఒక్కో క్షణం యుగం లా గడిచింది.

 ఎదురుగా ఉన్న బంగారయ్య,  వేరేవాడు గొడవ పడుతున్నారు, ఎవరు సిక్ లీడర్ అని. బంగారయ్య బాప్టిజం పుచ్చుకున్నరోజే నేర్చుకున్నాడు , 'దయగలవారై, కరుణగలవారై', అని. తనే ఒక్కంత భుజం మీద వేసుకుని బయలు దేరాడు సిక్ బే వరకూ. వెనుక ఇంకో ఇద్దరు వెంట పడ్డారు.

వీడికి వారి మాటలు 12 అడుగుల నూతి లోంచి వస్తున్నట్టు వినిపిస్తున్నాయి. 

శరాఘాతం అని చదివాడు, లక్ష్మణుడికి బ్రహ్మాస్త్రం తగిలిన విధానం. అలాగే పడి పోయాడు. ఎవరో ఇద్దరు నాగమణి రూమ్ దగ్గరకు తీసు కెళ్ళి బెడ్డు మీద పడేసారు. ఎండ తీవ్రత మొఖం మీదే పడుతుంది. సందడిలో ఎవ్వరూ చూడ లేదు. కదిలే ఓపిక కూడా లేదు. నోరు పిడ్చకట్టి, నాలిక చివర దాకా ఎండిపోయి, నొప్పిగా ఉంది . 

మేడం వచ్చారు. మళ్ళీ నొప్పా వీడికి. ఏం మాయ నొప్పి. ఎరా మళ్ళీ నొప్పా అని తనను చూసింది. అంత చిరాకు ఒక్క క్షణంలో పోయింది ఆమెకు. ఎవరు నటిస్తున్నారు ఎవరు నొప్పితో ఉన్నారో చెప్పడం లో ఆమె ఫస్ట్. రోజూ ఆమె చూసే సిక్ పేషెంట్లో ఒకరికి నిజంగా జబ్బు ఉంటే 4 ది అయితే భయం లేక నటనే. 

వీడి పరిస్తితి చూసింది. నిజమే బాగా నొప్పిలో ఉన్నాడు. మొఖం మీద పొడి తనం వచ్చేస్తుంది. తడి గుడ్డతో మొఖం కడిగింది, నీడలోకి ఈడ్చి ఆలోచనలో పడింది.

చొక్కా పైకి ఎత్తి చూసింది. ఎరా కక్కు కున్నావా, ఔను. ఏం లేదు కడుపులో, ఔను. ఎంత సేపటినుండి, ఉదయం పీటి . మరి రాలేదు ఏమీ, నిశ్శబ్దం.

స్కూళ్లో వాన్ లేదు ఆరోజు. ఊరికి తీసుకెళ్ళే ఉపాయం లేదు. ఫోన్ చేసే అవకాశం కూడా లేదు. 


తనే వీడికి సేవ. అమ్మాని మేడం వచ్చింది, ఆవిడ తనకు రూమ్ మేట్.

 ఉదయం బాగున్నాడే , సిల్లీ ఫెలో ఏమయింది. పాపం అని పొట్ట ఒక సారి చూసి ప్రశ్నార్థకం గా చూసింది. గోడకు చేర్చి మందు ఇచ్చారు , ఇచ్చిన క్షణం లో మిస్సైల్ లాగా బయటికి వచ్చేసింది.

విస్తూ పోయారు. ఇది వీడి సంగతి, నెట్టి మీద ఒక దెబ్బ ఎరా ఊసేసేవా అని. కాదు అంటున్నాడు కిట్టు. మళ్ళీ ఒకటి ఇస్తా బయటికి వస్తె తంతాను అని. 

రెండో మాత్ర ఇచ్చారు. నోరు తెరవలేదు కిట్టు, మాత్ర బయటికి వచ్చి నోట్లోనే ఉంది. అప్పటికి అర్థం అయ్యింది, తీసే మన్నారు. ఇంకా మాత్ర వేసే ప్రయత్నం ఆపారు.

 ఇద్దరూ చేసేది లేక బయటికి వెళ్లిపోయారు. నీరెండ విపరీతం గా ఉంది. గది ఉక్క పోస్తుంది. వేడికి చెమట పడుతుందా, నొప్పికి పడుతుందా చెప్పని స్థితి. 


ఎదురుగా నీలగిరి చెట్లు గాలికి ఊగుతున్నాయి. గాలి వాసనకి ఎండిన ముక్కు పుటల్లో ఘాటుగా ఉంది.

ఎవ్వరూ గుర్తు రావటం లేదు. ఆ రోజు పరీక్షకు చదువుకున్నవి ఏమీ గుర్తు లేవు. కాశ్మీర్ ప్రయాణం లో "ఉద్ధంపూర్ గాలి నైట్రస్ ఆక్సైడ్ " అనే పదం తప్ప.  ఉద్దంపూరు పదాన్ని మరే మరే అనుకుంటున్నాడు.


 రాత్రి పొద్దు పోయింది. ఆశగా వీడికో సం మరోసారి పాలు తెచ్చారు నర్స్ మేడం. 

అమ్మాణి అంటుంది 'నాగమణి ఎన్ని సార్లు తెస్తావ్'. ఆ పాత రెండు గ్లాసులు అక్కడే ఉన్నయ్ అని. కొంచెం తాగితే పడుకుంటాడే అంటుంది నర్సు మేడం. 

చీకట్లో టార్చ్ పట్టుకుని మెస్ వరకూ పోయింది. గట్టిగా అరుస్తూ అజమాయిషీ చేస్తుంది మెస్ లో ఎవరి మీదో. పాలులో ఏమి కలపవద్దు అన్నానా అని కేకలు పెడుతుంది.

మళ్ళీ వేరేగా స్వచ్చమయిన పాలు వేడి చేయిస్తున్నారు. చీకట్లో ఒక చేత్తో పాలు ఒక చేత్తో టార్చ్ తో నడుచుకుంటూ వచ్చి,  వేడి వేడి పాలు తీసుకుంటే తాగుతుందిరా అని కిట్టు బెడ్డు పక్కన పెట్టింది ఆశగా. 

మేడం కస్టం చూసి ఒక చుక్క తాగాడు. వెంటనే మళ్ళీ మిస్సైల్ లా బయటకి వచ్చేసింది. వీస్తూ పోయారు వాళ్ళిద్దరూ. 

నైట్ గౌన్లు వేసుకుని వీడి పక్కనే బాతాఖానీ వేస్తున్నారు.

మధ్యలో వచ్చి వీడిని చూస్తూనే ఉంది రాత్రంతా మేడమ్. పడుకోరా అని పక్కనే కొంత సేపు కూర్చుంది. పల్స్ చూసింది, నొప్పి ఎక్కువ వస్తే మళ్ళీ లేపు అని. 

నాకు చెప్పకుండా చావకు రోయి అని. నవ్వుకుంటూ రూమ్ లోకి వెళ్ళి పోయింది.

వెన్నెల రాత్రులు. ఎదుట ఉన్న దృశ్యం, గాలికి ఊగుతున్న నీలగిరి చెట్లు . పక్కనే చిన్న దారి, దారి మెలిక తిరిగి మెస్ వరకు వెళుతుంది. ఎల్లారావు ఇంకో మనిషి పెద్ద వంట డేక్సాను కడుగుతున్నారు. ఆ రోజుకు చివరికి వారి పని అయినట్టే. 

లౌకిక ప్రపంచం వెండి తెర మీద సినిమా లాగా అనిపిస్తుంది. గాలి వీస్తుంటే ఘాటు వాసనకి ఊపిరి తీసుకోవాలి అని గుర్తు కొస్తుంది లేక పోతే ఆపేసే వాడే. 

తనకు తెలియకుండా పొట్టలో గుండ్రంగా చుట్టుకున్న పేగు కదిలింది. ఆకాశాన్ని తాకిన బాధలో రీలు కట్టయ్యినప్పుడు 

ఎదుట వెండితెర కనిపిస్తుందే అలా ప్రపంచం మొత్తం ఒక రంగస్థలము గా ఒక్క సారి కనిపించింది. 


లైట్స్ ఔట్....

కళ్ళు మూత పడ్డాయి. ఎదుట చీకటి. గాలి వేస్తుంద్ ఇంకా. శబ్దం లేదు. తనకు బాహ్య ప్రపంచంలో ఉన్నవన్నీ వదిలేసి వచ్చిన భావం. తన ట్రంకు పెట్టి, తువ్వాలు, 521 నంబరు కంచం, పుస్తకాల సంచి, బకెట్ ఒక్కకటి గుర్తు చేసుకుంటూ వదిలి వేస్తున్నాడు మనసులో. 

కిరణ్, విరాట్, అంతా వేగంగా వెళ్ళే రైల్లో స్టేషన్ మీద ఉండిపోయిన ప్రయాణికుల్లా దూరం వెళ్తున్నారు.


పెద్ద గుడి గంట కొట్టిన తరువాత వచ్చే శబ్దం మారు మోగుతుంది చెవుల్లో.

ఎప్పుడో వదిలిన ఊరు, ఊర్లో కన్నవారు ఏమో లీలగా గుర్తు కూడా రాని ఆలోచన. వారు కూడా ఒక గుహలోని వెలుతురు చుక్కలాగా దూరం అయిపోయారు. 

శరీరం జలాన్ని వదిలేస్తుంది. సిగ్గు అనిపించకుండానే వంటిలొని నీరు బయటకు వచ్చేసింది నోట్లోనుండి , ఇంకా..

ఐదు భూతాలు... జల వాయు అగ్ని భూ ఆకాశం ఒక్కొకటిగా పోతున్నాయి. 

ఊపిరి పూర్తి స్థాయి నుండి చిన్న చిరు గాలిలా తగ్గింది. వళ్ళు, అందాకా వెచ్చగా ఉన్న రూమ్ ఇప్పుడు బాగా  చలి వేస్తుంది కూడా !

నీట్లో చేపకు నీరు ఎలా ఉంటుందో

తెలియనట్టు, ఊహలో నిరంతరం మునిగి ఉండే మనసుకు ఊహ ఆగితే ఊహ ఏమిటో అర్థం ఔతుంది. 

ఆపితేనే తెలుస్తుంది వెలుతురులో సదా ఉన్నామని. ఊహ ఆగింది ఒక క్షణం. నొప్పి పూర్తిగా పోయింది. వేడీ, చలీ పోయాయి. ఆకలి, ఘాటుగా ఉన్న వాసనా పోయాయి.

మది శూన్యం అయి మహా ఆనందం  నిండి పోతుంది. తేలికగా గాల్లో తేలినట్టు ఉంది. 


వేసవిలో తెల్లటి దుప్పటి కప్పిన నిండు వెన్నల లాంటి చల్లటి వెలుతురు మాత్రం ఉంది.

తృప్తిగా ఉంది.


దీపానికి వెలుతురు నింపే 

జ్యోతిర జ్యోతి లో తేలిపోతున్నాడు.


ఒక్క సారిగా కుదుపు, గట్టిగా లెంప దెబ్బలు కొడుతున్నారు, చల్లటి నీరు మొఖం మీద వేసి నోరు తడి చేస్తున్నారు.

ఎత్తి గోడ వాలుగా నిలిపి కదిపి లేరా లేరా ఎదవ ఒక్క నిమిషం బయటి వెళ్తే ఇంతలో ... ఏదో అరుపులు.

మొఖం మీదీ టార్చ్ వేస్తున్నారు. 

మళ్ళీ తీవ్రమయిన నొప్పి, ముక్కు  పుటల్లో ఘాటు గా వాసన.


కిట్టు నీ లేపుతున్నారు మేడం.

నా చేతిలో చస్తావారా.


కళ్ళు తెరిచాడు.

నొప్పి మళ్ళీ మొదలైంది.

పునరపి మరణం పునరపి జననం.

హాయి

 హాయి (Bliss)


నీవు ఒకరని

నేను ఒకరనీ

విశ్వం ఒకటి అని

దాని లోతులు దోచే

మేధ ఒకటి అనీ

అనుకున్నావా

 

ఇదే చీకటి వెలుగుల

మధ్య భావాల వైరం

అంతా ఒక్కటే


నీవే విశ్వం

విశ్వం నీవే

నేను నువ్వే

నువ్వే నేను


సత్యం జ్ఞానం

జ్ఞానం అనంతం

అనంతం బ్రహ్మం

నిజమేగా జ్ఞానం

దానికి లేదు కదా 

యే హద్దు


హద్దుల్లేని 

బ్రహ్మాండం

సత్యం జ్ఞానం

అనంతం బ్రహ్మం


ఎంత హాయి

ఈ జ్ఞానం

Once upon a time…

 

Once upon a time…



Once upon a time

there was

a peaceful ocean.


One day,

upon that ocean,

a tender young leaf

came floating down.


After a while,

a tiny raindrop

fell softly

into the leaf.


And there,

inside the little leaf,

the raindrop

became a shimmering dew drop.


Morning arrived.

Warm light

gently filled

the ocean world.


The drop, too,

filled with light.


And with light

came awareness.


The little drop

looked within

and saw

its own reflection.


In that reflection

it saw the leaf,

the distant sun,


the sky, the earth,

trees and meadows,

everything.


As the leaf

drifted peacefully

day after day,

the drop noticed

other leaves too.


Some from mango trees,

some from jasmine vines,

some from wild forest trees.


And in every tender leaf

there shimmered

a drop of consciousness.


A drop in a leaf.

A leaf upon the ocean.


An ocean reflected

inside every drop.


Every day

the drop searched

for another leaf

like its own.


And then,

one day,

it found one.


A tender leaf.

A shining drop within it.


Inside that drop,

its own reflection.

Inside its own reflection,

that other drop again.


Two reflections,

endlessly holding

one another.


The two drops

longed deeply

to come closer.


They came close,

very close,

yet could not

cross beyond

the edges of their leaves.


After many seasons

of longing,


the two drops

finally tied

their little worlds

together,


by gently locking

the stems

of their leaves.


Now together,

they wandered

across the ocean.


One morning,

after a silver rain,

they awoke to see

a third little drop,

a tiny one,

resting beside them


They passed it on 

to a fresh new leaf


Days passed.

Nights passed.

Rains arrived,

winds wandered,

rainbows appeared.


The sky, the earth,

the trees, the fields,

all stood witness.


And still

the ocean flowed.


Then one day,

within that great current,

the second drop

was swept away.


the first drop searched

everywhere.


Perhaps, it thought,

its story

was only

a shimmering illusion,

like heat dancing

upon tropical waters.


“This leaf too

will someday fade.

No matter what,

I must see

the oceans depths"


And so,

the drop moved

toward the edge

of the leaf.


It peered into

the abyss,

the vastness

it had feared

all its life.


It saw

its own reflection

inside the ocean,

and the ocean’s reflection

inside itself.


Fear arose.

The drop stepped back.


But morning returned.

Warm awareness

returned again.


Its imagination,

its memories,

all the beautiful scenes

within it,


the sky, the earth,

trees and meadows,

were all reflections

inside itself.


Then,

for the very first time,

in the morning light,

it truly saw

the ocean:


vast, alive,

filled with wondrous consciousness.


The same wonder,

the same light,

light of all lights,


filled the world,

the ocean,

every single drop.


the droplet was the ocean.

The ocean was the driplet.

Not two things,

only one awareness.


The drop’s fear

 dissolved.


It came once more

to the edge of the leaf.


And then,

the little drop

rolled 

into the ocean.


Awareness

became whole

once again.


And though

no drop remained,


the story lingered

in the breathing ocean,

blissful as eternity.

అనగా అనగా...

 అనగా అనగా... 



అనగా అనగా

ఒక ప్రశాంత 

సంద్రం 


సంద్రంలో

ఒక రోజు

చిగురాకు

పడింది 


ఉండీ ఉండీ 

ఒక చినుకు 

రాలింది 

ఆకులో 


అలా చిగురాకులో

చినుకు 

బిందువయింది


ఉదయం

ఉజ్వలం

గా వెలుగు

నిండింది 


బిందువులో

నిండింది

వెలుగు


వెలుగుతో

చైతన్యం 


బిందువు 

చూసింది

తనలోని

ప్రతిబింబాన్ని


ప్రతిబింబలో

చిగురాకు

దూరాన

సూరీడు


ఇంకా

నింగీ నేలా 

చెట్టూ చేమా

అంతా 


అలా రోజూ 

హాయిగా

తేలిపోయే

ఆకుకి 

కనిపించాయి

వేరే ఆకులు 


కొన్ని మామిడి

కొన్ని నేరేడు

కొన్ని తురాయి

అన్నిటిలోనూ

ఒక వెలుగులు

చిమ్మే బిందువు


తన లాంటి 

ఆకు కోసం

రోజూ

చూసేది

చినుకు


పోతే పోతే 

ఒక రోజు

కనిపించింది

తన లాంటి

చిగురాకు


చిగురాకులో

బిందువు

బిందువు లో

తన ప్రతిరూపం

తన బింబం లో

ఆ బిందువు

ఆ బిందువు లో

తన బింబం


రెండూ దగ్గరకి

వచ్చాయి

రెండు బిందువులు

కలిసే

తాపత్రయం


దగ్గరైతే

అయ్యాయి

కానీ

ఆకు దాటి 

వెళ్ళలేదు

నీటి చుక్కలు


ఎన్నో ఎన్నో

తపన ల 

తరువాత 


రెండూ 

తమ మూటికల ను

ముడి వేసాయి


ఇప్పుడు 

రెండు కలిసి 

తిరిగాయి 

సంద్రాన్ని


ఒకరోజు

చినుకుల వాన 

తెల్లారి చూస్తే

మూడో 

చినుకు 

బుల్లి చినుకు

పక్కనే


కలిసి వెతికి

వేరే ఆకులో చేర్చాయి

అలా

కొత్త చిగురాకులో

చిన్ని చినుకు


రోజులు వస్తున్నాయి

రాత్రులు వస్తున్నాయి

వర్షాలు

గాలి వానలు

ఇంద్ర ధనుస్సులు


నింగీ నీలా

చెట్టు చేమ

అలా సాక్షులు


సముద్రం లో నూ

ప్రవాహం

ఆ ప్రవాహంలో 

ఒక రోజు 

కొట్టుకు పోయింది 

రెండో చినుకు


ఎక్కడెక్కడ 

అని వెతికింది

బిందువు


అంతా ఒక

ఎండ మావి లాంటి 

 బ్రాంతి అని


ఆకు పాత 

బడుతుంది

తనేమో ఆవిరయి

రోజు రోజుకు

చిన్నబోయింది


ఎలా అయినా 

సాగరం లోకి

చూద్దామని

బిందువు 


ఆకు చివరకి

వెళ్ళింది

చినుకు


తన బింబం 

ఉంది సంద్రం లో

సంద్రం బింబం 

తనలో


భయం వేసింది

వెనక్కి వెళ్ళింది

బిందువు


మళ్ళీ ఉదయం

మళ్ళీ వెచ్చని

చైతన్యం


ఊహ నిండా

బిందువు నిండా

నిండిన దృశ్యాలే 


చెట్టు చేమ

నింగీ నేలా 

ఇవి తనలోని

బింబా లే


సంద్రం లోకి చూసింది

వెలుతురులో

మొదట సారి

సంద్రం నిండా

అద్భుత చైతన్యం


తను సాగరం

సాగరం తను 

ఒకటే వస్తువు

చైతన్యం ఒకటే 


బిందువు

భయం పోతోంది

ఆకు చివరకు

వచ్చింది


అలా బిందువు

సంద్రం లో

కలిసింది 


చైత్యన్యం 

మళ్ళీ ఒక్కటి 

అయ్యింది


శేషం లేకున్నా

ఈ కధ ఇక్కడి తో 

సశేషం


- శశి